Friday, March 18, 2011

ప్రకృతి ఇతిహాసము





















రాధా క్రిష్ణం మనోహరం
అద్దరి ఇద్దరి యమునా ఝరికి ;
కదిలే అలలకు గురువులైనవి;
జలముల ఇరువురి ప్రతి బింబాలు;
రాధా క్రిష్ణం మనోహరం ||

క్రిష్ణ రాధికా బోధనలో;
యమునా నదిలో కదిలే అలలు,
నేర్చెను మోహన గీతములు
కదన కుతూహల రాగములు; ||

శశి బింబముల వెన్నెలల
కథా కథనముల చాతుర్యం;
ప్రకృతి సుందర ఇతిహాసం
రాధా క్రిష్ణం మనోహరం ||

No comments:

Post a Comment