Showing posts with label సినిమా. Show all posts
Showing posts with label సినిమా. Show all posts

Thursday, November 5, 2015

పూలజడ, మధురై మల్లెలు

పూలజడ - అనగానే "మల్లెపూల జడ" అనే అర్ధం మాత్రమే స్ఫురిస్తుంది. 
"ముద్దబంతి పూలు పెట్టి ; మొగలిరేకులు ;
  జడను చుట్టి; హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా! 
.......... " అనే పాట , మాస్టర్ వేణు మ్యూజిక్ బాణీలో , సూపర్ సాంగ్ . 
"కలసి ఉంటే కలదు సుఖం " సినిమాలోది ఈ గీతం. 
ఇక్కడ "మొగలి రేకులు" - అని గీత రచయిత [?] ఉవాచ. 
;
*******************************,
మధురై మల్లెలు - three weeks దాకా వసివాడకుండా ఉంటాయి. 
అంత విలక్షణత ఉన్నవి, 
కాబట్టే, "Madhurai mallige" లకు కాపీరైటు, ప్రాంతీయ స్వీయ హక్కు - ను పేటెంట్ 
తీసుకున్నారు, ఆ మల్లెతోటల, వ్యాపార భాగస్వాములు.
***********************, 
ప్రస్తుతం, వక్తవ్యాంశం ;- ‘మొగ్గిన జడే’ - 
కిందటి నెల, రాత్రి 11 గంటలకు వచ్చిన కన్నడ 
సినిమా "‘మొగ్గిన జడే’"- చూసాను.
ఆ సినిమా - Moggina Jade – ಮೊಗ್ಗಿನ ಜಡೆ (2008/೨೦೦೮); 
నాకు ఎంతో నచ్చింది. ‘మొగ్గిన జడే’ = (మల్లె)మొగ్గల జడ - అని అనవచ్చును.  
‘మొగ్గిన జడే’ – అంటే ‘పూల జడ’; స్థూలంగా కథ . 
పదేళ్ళ చిన్నారి ప్రియకు ‘పూల జడ’ వేయించుకోవాలని చాలా కోరిక. 
ఈ స్పీడు యుగంలో - ఆధునికధోరణులు విసృతమౌతున్న ఈ రోజులలో - ఒంటరితనానికి 
గురి ఐన చిన్నారి పరిస్థితి తికమకలలుగా ఔతుంది. ఉద్యోగిని ఐన ఆమె తల్లి, చిన్నారి 
"ప్రియ" సంరక్షణకు ఉంచిన అమ్మాయి, సరిగ్గా చూడదు. 
ప్రేమరాహిత్య బాధతో సతమతమౌతూన్న ప్రియ, రోడ్డు పక్కన దొమ్మరాటలాడే పిల్లల స్నేహం చేస్తుంది. సహజంగానే ప్రియ అమ్మ నాన్నలు కుమార్తెని కోప్పడతారు. 
................ 
ఇట్లాగ కథ మలుపులు తిరిగి, కథ సుఖాంతం ఔతుంది. 
"‘మొగ్గిన జడే’" 2008 లో రిలీజ్ ఐనది. 
ఇండియన్ పనోరమా, బాలల చిత్రం - అవార్డులను గెలిచిన మూవీ ఇది. 
విచిత్రంగా - గూగుల్ ప్రపంచంలో - వీడియో మాత్రం లభించలేదు.
ఇంత మంచి చలనచిత్రం - వీడియో - ఉండకపోతే ఎట్లాగ?
ఎవరైనా, ప్రయత్నించి, అందరికీ , ఆ movie ని ప్రేక్షకులకు అందుబాటులోనికి తీసుకురండి! ప్లీజ్!
*********************************,
పనిలో పని :- పూలజడ - ను ఎట్లాగ వేయవచ్చునో , ఒక వీడియోలో చూద్దాము, పదండి! 
********************************;

మధురై మల్లెలు in=  FB సాహిత్యం  
‎Kusuma Piduri‎ to సాహిత్యం ; October 12 at 8:57am ·;- 
********************************;
అఖిలవనిత
Pageview chart 33657 pageviews - 820 posts, last published on Oct 12, 2015
;

Friday, August 10, 2012

మిలెరపా యోగి అద్భుత గాధ


మిలెరపా  యోగి 
;
;మిలెరపా 1052 - 1135 లలోని మహా యోగి
ఘుంగ్థంగ్ (ghunglang) లో జన్మించిన ఈతని మొదటి నామము "మిలా తోపగా".
ప్రత్తి, ఉన్ని బేహారులకు - గుర్తింపు నామము
"మిలా" (Mila, the cotton clad)
ఆతని తండ్రి మిలా దోర్జెసెంగ్
ఉన్ని వ్యాపారస్థుడు, ధనవంతుడు.
మిలా దోర్జెసెంగ్ కుమారుని పేరు "మిలాతోపగా", (The hero of this real story) ,
వీరి యొక్క కుమార్తె పేరు "పేట".
*****************************;

మిలె తొపగా (మిలెరపా యోగి తొలి పేరు) పశ్చిమ టిబెట్ లో 1052   సంవత్సరములో జన్మించాడు.
తొపగా కంఠము మధురంగా ఉండేది.
(Mila Thöpaga, which means - "Mila who is a joy to hear.")
గొంతెత్తి పాడితే చాలా కమ్మని మాటలు, పాటలు, శ్రోతలను ఆకట్టుకునేవి.
చుట్టుపక్కల వారు ఆతని గళ మాధుర్యాన్ని ఆస్వాదించే వారు.
అకస్మాత్తుగా తండ్రి జబ్బు చేసి, మంచం పట్టాడు.
కుటుంబ సభ్యులు అతడి మరణంతో దిక్కు తోచని వాళ్ళు అయ్యారు.
అప్పటి దాకా మిలడోర్జె సెంగ్ సంపాదించిన ఆస్థిపాస్థులు
అన్నింటినీ, కుత్సితులైన  ఆతని చుట్టాలు కాజేసారు.
దాంతో అతని కుటుంబం అష్ట కష్టాల పాలైనది.
ఒకప్పుడు భోగ భాగ్యాలతో తులతూగిన ఆ సంసారం
కట్టుబట్టలకూ, పూట కూడుకూ కూడా మొహం వాచిపోయిన స్థితిలో ఇరుక్కుపోయారు.
దీనికంతటికీ కారణం ఆతని మామ,
తక్కిన బంధువులు ఎవరూ వారికి- డబ్బు, వస్తువులు ఇవ్వకపోగా -
కనీసము మాట సాయం కూడా చేయలేదు.
మిలెరపా తల్లి, తన వారి సహాయంతో, దినభత్యం సంపాదనతో- రోజులు నెట్టుకురాసాగారు.

********************************;

అప్పటి ఆచారం ప్రకారం బాల్యంలోనే- అబ్బాయికి పెళ్ళి చేసుకోవలసిన అమ్మాయి నిశ్చయమై ఉండేది.
అదే రీతిలో తోపగా కు ఒక అమ్మాయి వివాహం చేసుకొన నిశ్చయమై ఉన్నది.
మిలెరపా పరిణయము చేసుకోదలచిన కన్నె పేరు జెస్సే(Zesay)
కానీ, "ఓడలు బళ్ళు- బండ్లు ఓడలు గా మార్చ గలిగిన కాల మహిమ".
"ఉన్నపాటున తలక్రిందులైన ఆర్ధిక స్థితిలో కూరుకుపోయిన ఈ బాలుడు తోపగా- కు
నా కూతురును ఇస్తే ఇక్కట్ల పాలౌతుంది.
కాబట్టి నేను నా పుత్రికను వీనికి ఇచ్చి, పెళ్ళి చేయను గాక చేయను" అని
చిన్ననాడు నిశ్చయం చేసిన వధువు యొక్క తండ్రి - నిర్ద్వంద్వంగానిరాకరించాడు.
తోపగా తల్లి హతాశురాలైనది.
అప్పటికి తోపగా వయస్సు 15 ఏళ్ళు మాత్రమే!
కన్నతల్లినీ, చెల్లెలు పేట నూ పోషించాల్సిన బాధ్యత ఆతని భుజస్కంధాల పైన ఉన్నది.
*******************************;

అండ లేని సంసారము కదా!
తోపగా మామ, చుట్టాలు నిరాధారులైన వీరిని చేరదీసి ఆశ్రయం కల్పించకపోగా,
మీదుమిక్కిలి వారి సంపదలను కాజేసారు.
పైగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవారు.
తోపగా కుటుంబం పట్ల తగని కాఠిన్యంతో వ్యవహరించేవళ్ళు.
కుక్కలు తినే ఆహారము మాత్రమే వీరికి తినడానికి ఇచ్చేవారు,
హీనంగా  జీవించవలసివచ్చింది.
ఆతని తల్లి పిల్లలు ఇరువురితో బంధువుల పంచన అలాగే కాలం వెళ్ళబుచ్చింది.
కాలచక్రంలో కొన్ని సంవత్సరములు తిరిగినవి.
 "ఇప్పుడు నా కుమారునికి 15 సంవత్సరాల వయసు వచ్చింది.
వీరు పుట్టినప్పుడు నిశ్చయించబడిన వధువు – జెస్సే(Zssey)- వీరిద్దరికీ పెళ్ళి చేయాలి,
కాబట్టి మాకు డబ్బును ఇవ్వండి.
ఇన్నాళ్ళూ మా ఆస్థినే మీరు అనుభవించారు కదా!
ఇప్పటికైనా మాకు కొంత డబ్బు దస్కం ఇస్తే,
మా గృహములో శుభకార్యాలను నెరవేర్చుకుంటాను."
ఆమె అభ్యర్ధనను పెడచెవిని పెట్టారు,
అంతటితో ఊరుకోలేదు ఆ క్రూరాత్ములు.
ఆమె బంధువులైన ఆ దుష్ట దంపతులు.ఈ కుటుంబాన్ని వెళ్ళగొట్టారు.
మిలెరపా, అతని చెల్లెలు పేట  నడి వీధిలో బేలలుగా నిలబడినప్పుడు,
తల్లి నేలపైన దొర్లుతూ విపరీతంగా విలపించింది.
క్రూరులు, దుష్టులైన - ఆ అంకుల్, ఆంటీల ఘాతుకాలకు నిశ్చేష్టురాలు ఐన ఆతని తల్లి
"వారిపై పగ తీర్చుకోవాలి" అనే ఆలోచనలతో కుతకుతలాడింది.
కుమారుడు తొగపాను పిలిచి,
"నాయనా! మనం నీచులైన ఈ బంధువుల వలన చెప్పరానన్ని ఇక్కట్ల పాలౌతూన్నాము కదా!
ఇంక నాలో సహనశక్తి లేదు. వారిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుని తీరాలి" అని నూరిపోసింది.
ఆమెకు పుట్టింటి వారు ఇచ్చిన కన్యాశుల్కము కొంచెం ఉన్నది. ఆ కొద్ది పొలాన్నీ అమ్మివేసినది.
అలాగ వచ్చిన కొంచెం సొమ్మునుకూడా -
ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరమునకై
వెచ్చించడానికి అతని తల్లి ఎంతమాత్రమూ వెనుకాడలేదు.
"నువ్వు క్షుద్ర విద్యలను నేర్చుకో!
కుమారా! నువ్వు శక్తివంత విద్యలను నేర్చుకోకుండా తిరిగి వస్తే- నేను ఆత్మహత్య చేసుకుంటాను" అని అన్నది.
తల్లి మాటలు అనుసరించడం వినా, మిలెరపాకు వేరే గత్యంతరం లేకపోయింది.
*******************************;
(links:  father's name was Mila Sherab Gyaltsen ;
  sister Peta,  )
తోపగా వేరే ఊళ్ళకు వెళ్ళాడు. ఎలాగో కష్టపడి, ఒక గురువు వద్ద చేరి, కొన్ని క్షుద్ర కిటుకులను  అభ్యసించాడు.
విద్యా జీవితములో తొగపా-కు ఏర్పడిన కొత్త పేరు మిలెరపా.
తమ ఊరికి తిరిగి వచ్చాడు మిలెరపా.
అక్కడ తాను నేర్చిన దుష్ట క్రూరత్వమైన మంత్ర విద్యలను ప్రయోగించాడు.
అక్కడ పండిన బార్లీ పంటలు, కొందరి జీవాలు ధ్వంసమైనాయి.
తల్లి గర్వంతో వికటాట్టహాసం చేసింది. ఆమె హుంకరిస్తూ అందరికీ ఎలుగెత్తి చాటింది
"చూసారా? నా పుత్రుడు గొప్ప మహిమలు సాధించాడు. తలచుకోగానే తుఫానులను సృష్టించి, అందరినీ అతలాకుతలం చేసేయగలడు" విపరీతమైన శాడిస్టు ఆనందములతో అరిచి, చాటింది.
ప్రజలందరూ ఆమె పలుకులు వినగానే భీతితో బెంబేలెత్తారు. 
వారికి భయంతోపాటు మిలెరపా పట్ల ఏహ్యభావం సైతం పెరగసాగింది. 
దాంతో మిరెలెపాకు వారు అపకారం తలపెట్టసాగారు. 
భాగ్యవశాత్తూ- అతడు వెంట్రుక వాసిలో అనేక కీడులను, అపాయాలను తప్పించుకోగలిగాడు. 
మిలెరపా తన సోదరిని - 
ఝాంగ్ ఝుంగ్సీమ రాజు (king of  Zhang-zhung )కు ఇచ్చి పెళ్ళి చేసాడు.
*******************************;
మిలెరపాకు నెమ్మది మీద అర్ధమైనది ఏమని అంటే- 
"నేను ప్రకృతికి, భగవంతుని సృష్టికీ, జీవులకూ చాలా అపకారాలు చేసాను. 
నేను చేసిన కార్యాలు దుష్ఫలితాలను ఇచ్చాయి. 
ఇకపై ఈ విధంగా లోకానికి కీడు చేసే దుష్కృత్యాలు చేయ కూడదు" అనుకున్నాడు. 
మిలెరపాకు పశ్చాత్తాపం కలిగింది.
అతడు పాప కృత్యాలను మానివేసాడు.
"కర్మ సిద్ధాంత పథము"లో జీవనగమనం కొనసాగాలి" అనే అభిలాష మొదలైంది.
ఐతే ఈ పర్యాయం ద్వితీయ దశలో 
మానసిక పరిణతి పొందిన మిలెరపా భావాలు 
నియమబద్ధతతో మెరుగులు పొందబడినవి. 
మరల "ఒక మంచి గురువు వద్ద చేరి, శిష్యరికం చేసి, 
పవిత్ర భావాలతో తన మనో జీవిత గమ్యాలను నిర్మించుకోవాలి" అని తలచాడు.
ఈ సారి గురుదేవుల కొఱకు ఆతని అన్వేషణ ఫలించింది.
ఆ నవీన గురుపుంగవుడు "మార్పా", 
ఆతడు భారతదేశానికి అనేకసార్లు వెళ్ళి ఉన్నాడు. 
అనేక బౌద్ధ బోధనలను విని ఆకళింపు చేసుకున్నాడు. 
అగణిత రచనల కట్టలను టిబెట్ కు తీసుకుని వచ్చాడు.
ఐతే మార్పా (Yogi GURU/ philosophy teacher) 
అప్పటికే తోపగా (మిలెరపా) వలన 
ప్రకృతికీ, జనులకూ సంభవించిన దురంతాలు, నష్టాలను గురించి 
కర్ణాకర్ణిగా విని ఉన్నాడు. 
అందుచేత "నీ వంటి క్రూరుని నేను శిష్యునిగా స్వీకరించజాలను." అంటూ తిరస్కరించాడు.
ఐనప్పటికీ మిలెరపా నిరాశకు లోనుగాలేదు, మంచి ధ్యేయంకోసమై, 
తాను నిర్మించుకోవలసిన మంచి బాట- కై ఎంతో సంయమనం పాటించాడు. 
ఆ నూతన గురు ఆశ్రమమును వీడలేదు, సరి కదా! 
మార్పాకు వినమ్రతతో పదే పదే విన్నవించుకుంటూ, 
సమయం సందర్భం కలిసివచ్చినప్పుడు మార్పాకు సేవలు చేసాడు.
ఎటులనో మార్పా మనసు మెత్తబడింది. మిలెరపా పై దయ కలిగిన హృదయంతో- 
"అహింసను నమ్మికతో పాటించి, అదే జీవన మార్గంగా చేసుకోవాలి. 
అలాగైతేనే నీకు-నేను బోధకునిగా ఔతాను"
"అట్లే, మీ మాటను జవదాటను" అంటూ 
మిలెరపా కొత్త పరిసరాలలో బ్రతుకు గమ్యాన్ని నిర్దేశించికుని, 
పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడానికి కంకణము కట్టుకున్నాడు.
"మిలెరపా లో నిజమైన ఆత్మ శుద్ధి కలిగిందా? 
లేదా నా ఎదుట నటిస్తున్నాడేమో?" అని మార్పా సందేహం.
మిలెరపాను అనేక క్లిష్ట పరీక్షలకు గురిచేసాడు. 
అన్ని పరీక్షలకూ మిలెరపా, సహనంతో తట్టుకుని నిలబడ్డాడు.
"మిలెరపా ! భవనాన్ని కట్టు" అని ఆజ్ఞాపించేవాడు.
మిలెరపా  కష్టపడి కట్టిన బిల్డింగులను నిర్దాక్షిణ్యంగా పడగొట్టేవాడు.
(His only consolation was Damema, the kind wife of Marpa) 
ఇంతటి క్లిష్టమైన దారుణ స్థితిలో మిలెరపాకు చీకటిలో దొరికిన చిగురంత దీపమే 
అధ్యాపకుడైన మార్పా భార్య దామెమ్మ (Dagmema).
ఆమె దయాశీలిని. మార్ప భార్య దామెమ్మ  ఎండమావిలో మరీచికలా, 
కన్న తల్లికన్న మిక్కుటముగా ప్రేమ అనురాగాన్ని,జాలిని చూపించేది.
ఆమె మిలెరపా ను "నాయనా! బాధ పడకు" అంటూ ఓదార్చేది.
బాధకు తట్టుకోలేక విలవిలలాడే మిలెరపాను అనునయించేది.
ఏడుస్తూన్న మిలెరపాను సముదాయిస్తూ, కన్నతల్లిని మైమరిపిస్తూ, వాత్సల్యాన్ని కురిపించేది.
రాళ్ళను మోయించడం వంటి అనేక పనులతో, మిలెరపా  బాగా అలసి పోయేవాడు.
శ్రమతో మిలెరపా విపరీతంగా డస్సిపోయేవాడు. 
ఇలాటి కనాకష్టమైన కార్యాలను సంయమనంతో, 
పెదవులపై చెక్కు చెదరని చిరు దరహాసములతో- 
మిలెరపా వ్యక్తిత్వం ధీరత, ఆత్మస్థైర్యాలతో వికాసం పొందింది. 
ఇలాటి సంఘటనలన్నిటినీ మిలెరపా ఓర్పుతో అధిగమించి, 
గురు మార్పా చేత "శభాష్!" అనిపించుకొని, మెప్పించగలిగాడు.
అలాగ గురు శుశ్రూష చేస్తూ, మిలెరపా తన బ్రతుకు బాటలను దేదీప్యమానం చేసుకోగలిగాడు.ను,
ఇప్పటికి మిలెరపా బ్రతుకుబండి మిట్టపల్లాలను దాటి, 
సమతల సీమా మార్గములో ముందుకు ప్రయాణం సాగించగలిగినది.
"అనేక క్లిష్ట పరిస్థితులను నెగ్గుకుని వచ్చిన మిలెరపా యొక్క శక్తి సామర్ధ్యాలను, 
నీతి నిజాయితీలను మార్పా గుర్తించాడు. 
*******************************;
మిలెరపా తన మార్పా ఉపాధ్యాయుని అనుజ్ఞను ప్రకారం 
ఆయన చెప్పిన వాటిని అనుసరించి, పాటించసాగాడు.
మిలెరపా ఒక గుహలో కూర్చునేవాడు.
తన తలపై ఒక దీపాన్ని పెట్టుకునేవాడు. 
ఆ దీపం పూర్తి అయ్యేవఱకూ అలాగే తన ధ్యానమును ఏకాగ్రచిత్తుడై చేసేవాడు.
ఇలాగ 11, 12 నెలలు మిలెరపా  దీక్ష అవిశ్రాంతంగా చేసాడు.
అటు పిమ్మట తన అనుభవాలను  లిపి బద్ధము  చేసి, లోకమునకు అందించినాడు మిలెరపా.

*******************************;
మిలెరపా కు నెమ్మది మీద అర్ధమైనది ఏమని అంటే- 
"నేను ప్రకృతికి, భగవంతుని సృష్టికీ, జీవులకూ చాలా అపకారాలు చేసాను. 
నేను చేసిన కార్యాలు దుష్ఫలితాలను ఇచ్చాయి. 
ఇకపై ఈ విధంగా లోకానికి కీడు చేసే దుష్కృత్యాలు చేయకూడదు" అనుకున్నాడు. 
మిలెరపాకు పశ్చాత్తాపంతో కలిగింది.
అతడు పాప కృత్యాలను మానివేసాడు.
"కర్మ సిద్ధాంత పథము"లో జీవనగమనం కొనసాగాలి" అనే అభిలాష మొదలైంది.
ఐతే ఈ పర్యాయం ద్వితీయ దశలో మానసిక పరిణతి పొందిన మిలెరపా భావాలు 
నియమబద్ధతతో మెరుగులు పొందబడినవి. 
మరల "ఒక మంచి గురువు వద్ద చేరి, శిష్యరికం చేసి, 
పవిత్ర భావాలతో తన మనో జీవిత గమ్యాలను నిర్మించుకోవాలి" అని తలచాడు.
ఈ సారి గురుదేవుల కొఱకు ఆతని అన్వేషణ ఫలించింది.
ఆ నవీన గురుపుంగవుడు "మార్పా", 
ఆతడు భారతదేశానికి అనేకసార్లు వెళ్ళి ఉన్నాడు. 
అనేక బౌద్ధ బోధనలను విని ఆకళింపు చేసుకున్నాడు. 
అగణిత రచనల కట్టలను టిబెట్ కు తీసుకుని వచ్చాడు. 
ఐతే మార్పా అప్పటికే మిలెరపా వలన 
ప్రకృతికీ, జనులకూ సంభవించిన దురంతాలు, నష్టాలను గురించి కర్ణాకర్ణిగా విని ఉన్నాడు. 
అందుచేత "నీ వంటి క్రూరుని నేను శిష్యునిగా స్వీకరించజాలను." అంటూ తిరస్కరించాడు.
ఐనప్పటికీ మిలెరపా నిరాశకు లోనుగాలేదు, మంచి ధ్యేయంకోసమై, 
తాను నిర్మించుకోవలసిన మంచి బాట- కై ఎంతో సంయమనం పాటించాడు. 
ఆ నూతన గురు ఆశ్రమమును వీడలేదు, సరి కదా! 
మార్పాకు వినమ్రతతో పదే పదే విన్నవించుకుంటూ , 
సమయం సందర్భం కలిసివచ్చినప్పుడు మార్పాకు సేవలు చేసాడు.
ఎటులనో మార్పా మనసు మెత్తబడింది. మిలెరపా పై దయ కలిగిన హృదయంతో- 
"అహింసను నమ్మికతో పాటించి, అదే జీవన మార్గంగా చేసుకోవాలి. 
అలాగైతేనే నీకు-నేను బోధకునిగా ఔతాను"
"అట్లే, మీ మాటను జవదాటను" అంటూ 
మిలెరపా కొత్త పరిసరాలలో బ్రతుకు గమ్యాన్ని నిర్దేశించుకుని, 
పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడానికి కంకణము కట్టుకున్నాడు.
"మిలెరపా లో నిజమైన ఆత్మ శుద్ధి కలిగిందా? 
లేదా నా ఎదుట నటిస్తున్నాడేమో?" అనే  
మార్పా సందేహం ఇంకా పూర్తిగా తీరలేదు.
మిలెరపాను అనేక క్లిష్ట పరీక్షలకు గురిచేసాడు. 
అన్ని పరీక్షలకూ మిలెరపా , సహనంతో తట్టుకుని నిలబడ్డాడు.
"మిలెరపా ! భవనాన్ని కట్టు" అని ఆజ్ఞాపించేవాడు.
మిలెరపా  కష్టపడి కట్టిన బిల్డింగులను నిర్దాక్షిణ్యంగా పడగొట్టేవాడు.
ఇంతటి క్లిష్టమైన దారుణ స్థితిలో మిలెరపాకు 
చీకటిలో దొరికిన చిగురంత దీపమే అధ్యాపకుడైన మార్పా భార్య దామెమ్మ.
ఆమె దయాశీలిని. ఆమె మిలెరపాను 
"నాయనా! బాధ పడకు" అంటూ ఓదార్చేది.
ఆమె బాధకు తట్టుకోలేక విలవిలలాడే మిలెరపాను అనునయించేది.
ఏడుస్తూన్న మిలెరపాను సముదాయిస్తూ, 
కన్నతల్లిని మైమరిపిస్తూ, వాత్సల్యాన్ని కురిపించేది.
రాళ్ళను మోయించడం వంటి అనేక పనులతో, 
మిలెరపా  బాగా అలసి పోయేవాడు.
శ్రమతో మిలెరపా విపరీతంగా డస్సిపోయేవాడు. 
ఇలాటి కనాకష్టమైన కార్యాలను సంయమనంతో, 
పెదవులపై చెక్కు చెదరని చిరు దరహాసములతో- 
మిలెరపా వ్యక్తిత్వం ధీరత, ఆత్మస్థైర్యాలతో వికాసం పొందింది. 
ఇలాటి సంఘటనలన్నిటినీ మిలెరపా ఓర్పుతో అధిగమించి, 
గురు మార్పా చేత "శభాష్!" అనిపించుకొని, మెప్పించగలిగాడు.
అలాగ గురు శుశ్రూష చేస్తూ, మిలెరపా తన బ్రతుకు బాటలను దేదీప్యమానం చేసుకోగలిగాడు.
ఇప్పటికి మిలెరపా బ్రతుకుబండి మిట్టపల్లాలను దాటి, 
సమతల సీమా మార్గములో ముందుకు ప్రయాణం సాగించగలిగినది.
"అనేక క్లిష్ట పరిస్థితులను నెగ్గుకుని వచ్చిన 
మిలెరపా యొక్క శక్తి సామర్ధ్యాలను, నీతి నిజాయితీలను మార్పా గుర్తించాడు. 
మిలెరపా తన మార్పా ఉపాధ్యాయుని అనుజ్ఞను ప్రకారం 
ఆయన చెప్పిన వాటిని అనుసరించి, పాటించసాగాడు.
*******************************;
మిలెరపా ఒక గుహలో కూర్చునేవాడు.
తన తలపై ఒక దీపాన్ని పెట్టుకునేవాడు
ఆ దీపం పూర్తి అయ్యేవఱకూ అలాగే తన ధ్యానమును ఏకాగ్రచిత్తుడై చేసేవాడు.
ఇలాగ 11 నెలలు మిలెరపా  దీక్ష అవిశ్రాంతంగా చేసాడు.
అటు పిమ్మట తన అనుభవాలను  లిపి బద్ధము  చేసి, 
లోకమునకు అందించినాడు మిలెరపా.

మిలెరపా ధార్మిక ప్రవచనాలు, పద్య కావ్యాలూ 
అనేక ప్రపంచభాషలలోనికి అనువాదం ఐనవి. 
మిలెరపా పాటలు, పద్యములు జగద్విఖ్యాతి గాంచినవి.
మిలెరపా స్థాపించిన "గంపోపా సాంప్రదాయము"ను 
లోకవ్యాప్తముగా అనుయాయులు ఆచరిస్తూన్నారు.
(tradition- Gampopa)
మిలెరపాకు అసంఖ్యాక శిష్యగణములు ఉన్నారు.
మిలెరపా సూక్తిముక్తావళి బౌద్ధ అనుయాయులకు శిరోధార్యాలైనవి.

"Cease negative actions, 
cultivate positive actions, 
and tame you mind."

*******************************;

Milarepa సినిమా 2006 లో వచ్చినది.
Milarepa: Magician, Murderer, Saint
Directed by Neten Chokling

Tags:- 
1) Milarepa first heard the Lama utter the name "Marpa", 
he felt a thrill go through his body 
2) Milarepa had countless disciples such as Rechung Dorje Drakpa, 
Gampopa or Dhakpo Lhaje, the eight-heart-sons, and many others)
3)(Milarepa was born to Mila-Dorje-Senge in 1052 AD: 
His father was Mila Sherap Gyaltsen and mother, Nyangtsa Kargyen.
He had one younger sister, Peta Paldron)
;

Tuesday, February 22, 2011

నువ్వులు" ఎక్కడైనా రాయబడతాయా?????


"నువ్వులు" ఎక్కడైనా రాయబడతాయా?????
ఎర్రకోట వీరుడు - అనే తెలుగు సినిమా
1973 లలో విడుదల ఐనది.
దశరధరామిరెడ్డి దర్శకత్వములో
వచ్చిన చలన చిత్రములో
ఈ పద బంధం ఉన్నది లెండి.
ఈ చలన చిత్రానికి
సంగీత దర్శకుడు ఘంటసాల విజయకుమార్.
ఇతడు ఘంటసాల గారి మొదటి కొడుకు.
ఈ Telugu Movie లో నటి నటులు
ఎన్.టి.రామారావు, నంబియార్,
బి. సరొజాదేవి, సావిత్రి మున్నగు వారు.
cinemaలో ఒక పాట,
సావిత్రి నాట్యంతో చిత్రీకరణ జరిగింది.
సినిమా లోని ఈ గీతం కాస్త
మాషాగా ఉంటుంది .
"అ ఆ - లు అన్నీ
నువ్వులు రాయాలి ;
నా రాజా కన్నుల్లో -
ఎల్. ఆర్. ఈశ్వరి చేత
కథానాయికకు సంబంధించిన గీతాన్ని
పాడించడం కాస్త విచిత్రమే!
సరే! ఇక్కడ ఆ పాటను చదవండి. ;

&&&&&&&&&&&&&&&&&&&&&&

అ - ఆ - లు అన్నీ - నువ్వులు రాయాలి , నా రాజా !
నా కన్నుల్లో హృదయం ఉంది ,నువ్వే చూడాలినా రాజా!



1)అందాల సోకులన్నీ నీకేలే , నా రాజా !
గారాల కోరికలన్నీ
నీకేలే, నా రాజా!
నది లాగా గల గల పారు
ఇంపైన బుల్ బుల్ జోరు
విడరానీ బంధం పెనవేయాలీ ||

2)సొగసైన పూవును నేను ,
కోపమా నా సామీ!
సొరగాలు చూపిస్తాను ,
రా రాదా నా సామి! ||

3)వద్దన్నా వదలను నిన్ను
అన్నా విడువను నేను
వీరాధి వీరుడవీవు నా సామి!
ఊరించకు ఇంకా నన్ను ||

(ఇంతా చేసి ఆనక ఎప్పటికో అర్ధమైంది;
నువ్వు - కు బహువచనము - "నువ్వులు" అన్న మాట.
అలాగ శ్రోతలకు లభించిన బహుమానం " నువ్వులు ' పదం. )

*********************************

a- aa- lu annI nuvvulu raayaali naa raajaa !
naa kannullO hRdayaM uMdi ,
nuvvE chUDAlinaa raajaa!

1)aMdaala sOkulannii nIkElE , naa
raajaa !
gaaraala kOrikalannii nIkElE, naa raajaa!
nadi laagaa gala gala paaru iMpaina
bul^ bul^ jOru viDaraanii baMdhaM penavEyaalI ||

2)sogasaina puuvunu nEnu ,
kOpamaa naa saamii! soragaalu chuupistaanu ,
raa raadaa naa saami! ||


3)Vaddannaa vadalanu ninnu
U nannaa viDuv
anu nEnu
Viiraadhi viiruDaviivu naa saami!
UriMchaku iMkaa nannu ||

Monday, February 15, 2010

పడమటి సంధ్యా రాగం


-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-


పిబరే రామ రసం ;
============

పిబరే రామ రసం; రసమే పిబరే రామ రసం
పిబరే రామ రసం; రసమే పిబరే రామ రసం
జనన మరణ భయ శోక విదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం
జనన మరణ భయ శోక విదూరం - 2 - ఆ||

సకల శాస్త్ర నిగమాగమ సారం
పిబరే రామ రసం; రసమే పిబరే రామ రసం
పిబరే రామ రసం; రసమే పిబరే రామ రసం
శుద్ధ పరమ హంస ఆశ్రమ గీతం
శుక శౌనక కౌశిక ముఖ పీఠం - 2 - ||

పిబరే రామ రసం
రసమే పిబరే రామ రసం

===================================
తెలుగు చలన చిత్రము : పడమటి సంధ్యా రాగం
singers : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ

Wednesday, December 16, 2009

హేమ మాలిని అభినయ విలాసము; ;





-
-
-
-
-
-


జోహారు శిఖిపింఛ మౌళీ!~~~
జోహారు రస రమ్య గుణశాలి! వనమాలి!
జోహారు శిఖి పింఛ మౌళీ! ||జోహారు||

1. కలికి చూపులతోనే చెలులను కరగించి ;
కరకు చూపులతోనే అరులను జడిపించి ;
నయగార మొక కంట!
జయ వీర మొక కంట!
చిలకరించి చెలువు మించి, నిలిచిన
శ్రీకర! నర వర! సిరి దొర //జోహారు//

2.నీ నాద లహరిలో నిదురించు భువనాలు-
నీ నాట్య కేళిలో నినదించు గగనాలు-
నిగమాలకే నీవు సిగ బంతివైనావు
యుగ యుగాల దివ్య లీల-
నెరపిన అవతార మూర్తి!
ఘన సార కీర్తి //జోహారు//

3. చకిత చకిత హరిణేక్షణా-
వదన- చంద్ర కాంతు లివిగో!
చలిత లలిత రమణీ చేలాంచల--
చామరమ్ము లివిగో!
ఝళం ఝళిత సుర లలనా
నూపుర - కల రవమ్ము లివిగో!

మధు - కర రవమ్ములివిగో !
మంగళ రవమ్ములివిగో !
దిగంతముల, అనంతముగ గుబాళించు ;
సుదూర నందన సుమమ్ము లివిగో! ||జోహారు||

**********************************************
చిత్రం : శ్రీ కృష్ణ విజయము ;గానం : పి.సుశీల ;సంగీతం: పెండ్యా

Tuesday, August 18, 2009

నానా సూన వితాన వాసనలు

శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థానములోని అష్ట దిగ్గజములలో ప్రముఖుడు. ఈయన ,రాయలు భార్య,వినతి పై,రాసిన"పారిజాతాపహరణము"నకు,"రాయలు,రాణి పైన కోపగించుకోవడము " కూడా మూల కారణమైనది
సత్య భామా దేవి కినుకను తగ్గించడానికీ,ఆమె తన భర్తతో అనురాగముతో వర్తించడానికీ ఒక పద్యాన్ని రాసేసి ,
"ముక్కు తిమ్మన"గా లోక బిరుదును సంపాయించేసాడు ధూర్జటి.
ఆ నాసికాభరణము కాంతులు చూడండి/చదవండి.
"నానా సూన వితాన వాసనల నానందించు
సారంగ మేలా తన్నొల్లదటంచు
గంధ ఫలి బల్కానల్ తపం బొంది
యోశా నాసాకృతి బూనె సర్వ సుమన
సౌరభ్య సంవాసియై బూనెం బ్రేంఖణ
మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్ .

"అన్ని పుష్పాల మీద వాలుతూంటుంది మిళిందము.
కానీ , ఆ తుమ్మెద నా మీద ఎందుకు వాలడం లేదు?" అని అలిగింది సంపెంగ పువ్వు.
దుర్గమారణ్యాలలోనికి వెళ్ళింది సంపంగి పూవు.తీవ్రంగా తపస్సు చేసి భగవంతుని వరం కోరినది.
" ప్రేయసి నాసిక (= ముక్కు) గా పునర్జన్మను పొందినది. ఆ నాటి నుండీ,వర ప్రభావముచే అన్ని పూవుల వాసనలని ఆస్వాదించసాగినది .
ఇరు వైపులా "నయనములు -( గండు తుమ్మెద ) చూపులను తుమ్మెదల మాలగా ధరించింది .


"ముక్కు తిమ్మన "గా - వాసి కెక్కిన, ధూర్జటి వివరాలకై,"వేంకటార్య కవి"( పౌత్రుడు) రచించిన "శ్రీ కృష్ణ రాయ విజయము"ను ఆధారముగా భావిస్తారు. "భారద్వాజ గోత్ర ; పాక నాటి ; ఆర్వేల నియోగి ; అని తెలుస్తూన్నది. శ్రీ కాళ హస్తీశ్వర శతకము" మూలంగా ధూర్జటి మహా కవి,"శ్రీ కాళ హస్తి లో నివసించెనని " స్పష్టమౌతున్నది.

Friday, August 14, 2009

వెండి తెరపై బంగారు గానం


-

-

-

( కాంతా రావు,కృష్ణ కుమారి

-యుగళ గీతము )
(పల్లవి ) :::::

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది //

కన్నులకేలా నాపై కోపం కణకణలాడినవి
నీ చూపులకేనా నాపై కోపం తూపులు దూసినవి //వెన్నెలకేలా //

బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో…
బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో…
నీ వలపులు చిందే పలుకుల విందే చేదుగ మారినదో

పీటలపైన పెళ్ళిదినాన మాటలు కరువైనా
నన్ను ఓరచూపుల కోరికలూరా చూడవా నీవైనా..//వెన్నెలకేలా //

మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా..
ఓ మరదలు పిల్లా! జరిగినదెల్లా మరచుటే మేలుగదా..
నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా ..
నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా .. //వెన్నెలకేలా //

--------------------------------------------------

చిత్రం :కానిస్టేబుల్ కూతురు
రచన:ఆత్రేయ:
సంగీతము:ఆర్.గోవర్ధన్
గాయకుడు: పి.బి.శ్రీనివాస్

Monday, August 10, 2009

చిత్రం: ఆమె ఎవరు?
రచన: దాశరధి
సంగీతం: వేద
********************************** (పల్లవి:)
ఓ నా రాజా.. రావా రావా.. (2)
చెలిని మరిచితివా? ఓ నా రాజా..
రావా.. రావా....ఓ నా రాజా......

(చరణం 1:)
నీరూపే ఆశ రేపేను
నీమాటే వీణ మీటేనూ.. (2) గతాలే నన్ను పిలిచాయి..
ఆహా!ఏమి లేదోయి
కలగా కరిగిందంతా
జగమే ఎంతో వింత!
రేయి పగలూ నిన్నే వెతికేనోయి // ఓ నా రాజా //
(చరణం 2:)-
వృధాగా కాలమీదేను
నిరాశ పొంగివొచ్చేను(2)
తరంగంలా లాగా రావోయీ! ప్రియా!నన్ను ఆదుకోవోయి
ఏదో తీయని బాధ!
కన్నీరొలికే గాథ,
రేయి-పగలూ నిన్నే వెదికేనోయి // ఓ నా రాజా //
(చరణం 3:)
నీకోసం నేనే వచ్చాను
నీ ఇంటికి దీపమైనాను(2)
నాతోనే ఆడుకోవయ్యా నీ కోపం నేడు నీకేలా
నీ అడుగులలో నేనూ
నాకన్నుల్లో నీవు
నాలో నీవు - నీలో నేనే // ఓ నా రాజా //
(చరణం 4:)-
వరించిన మంచి వధువును లే!
స్పృశించే తీపి మధువును లే!
ప్రియా!!! ప్రేమ కథనోయి! సదా నీ నీలి నీడనులే!
ఏనాటిదో ఈ బంధం!
ఎన్నడు చెడదీ బంధం!
రేయీ,పగలూ,నిన్నే వేదికేనోయీ.. // ఓ నా రాజా /
http://tbn0.google.com/images?q=tbn:Rbmw-1_oiqchDM:https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhgBVq5Qcnq7j-WC3fF0gl9oLW38ufOPP036VI74TT1PRI8EzrSwP8K7U91ANIZ14kMPxVGVm0iwjuITUeG4LbBruCtLiI9b5u4XwL3p2HAj3-prap0kE85HCwBQ7O4gZgu5QfU_owjd0DT/s400/JAYALALITHA67.jpg

Friday, August 7, 2009

వసంత సేన (సినిమా )













వసంత సేన (సినిమా పాట)
(పద్మిని,నాగేశ్వర రావు);రచన:దాశరధి
సంగీతం:సాలూరి రాజేశ్వరరావు;గానం:ఘంటసాల;జానకి

1)కొండలన్ని వెతికేను,
కోనలన్ని తిరిగేను
చెలియా!సఖియా!నీకోసమే!
రావే వయ్యారి!నా వలపు మయూరి!-(2)
నవ్వులు చిందించి నటియించవే (2)

2)చెంతచేరి రావొయి!
చింతదీర్చి పోవోయి!
వయసూ సొగసూ నీ కోసమే
నేడే వసంతం,
ఈ జగమున విరిసే
నేడే వసంతం,నా మనసున విరిసే
కోయిల కొమ్మల్లొ కోయన్నది ఓ.. (2)

3)ఝుమ్మని రాగాలు పాడెను భ్రమరం
కమ్మని తేనెలనందించు కుసుమం
జల జల నాట్యాల ప్రవహించు నదులు
సాగరు కౌగిట చేరేను తుదకు.

4)నెలరాజు నేడేల పిలిచేను కలువ,
కలువకై జాబిల్లి కదిలీ వచ్చేను
వలచిన చెలికాని తలచేను చెలియ,
చెలియను మురిపింప చేరేను ప్రియుడు

5)నిజమైన అనురాగమదియే కదా:ఆ..
నిజమైన అనురాగమిదియే కదా!
చెంతచేరి రావొయి!
చింతదీర్చి పోవోయి
వయసూ,సొగసూ నీ కోసమే!

రావే వయ్యారి నా వలపు మయూరి (2)
నవ్వులు చిందించి నటియించవే (2)
ఓ సుందరీ..ఓ సుందరీ..ఓ సుందరీ!

Monday, August 3, 2009

"సిరి సంపదలు"సినిమాలోని అలనాటి మాధుర్యం ఈ పాట.
వెండి తెర మిద సావిత్రి,వాసంతి,గిరిజల నటన ప్రేక్షలకు అహ్లాదాన్ని కలిగించే
వీనుల ,కన్నుల విందులు.
****************************************
పల్లవి;
వేణు గానమ్ము వినిపించెనే!
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే;
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే;
వేణు గానమ్ము వినిపించెనే||

దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
అంత మొనగాడటే ఒట్టి కథలేనటే
ఏది కనపడితే నిలవేసి అడగాలి వానినే...
||వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే...||

మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలను చూపాడట
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలను చూపాడట
అంత మొనగాడటే వింత కథలేనటే
ఏది కనపడితే కనులారా చూడాలి వానినే...
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..

దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
ఘల్లు గల్ గల్లన ఒళ్ళు ఝల్ ఝల్లన
తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట
||వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..

Tuesday, July 28, 2009

యుగళ గీతము (ఈ మహిమ నీదేనులే !)

ఎస్.జానకి గాత్ర మాధుర్యమునకు వేరే వివరణలు అక్కర లేదు కదా!
పెండ్యాల నాగేశ్వర రావు "కళావతి(కలావతి) రాగములో కూర్చినది ఈ పాట,ఘంటసాల అత్యున్నత శిఖరములందున్నప్పుడు,వేరే పద్ధతిలో,వైవిధ్యముగా ఉదయించినది ఈ స్వరార్ణవము. జానకి స్వరముతో కలిసిన "యుగళ గీతము"గా శ్రోతలకుకర్ణాటక సంగీత విద్వాంసుడైన "బాల మురళీ కృష్ణ "గళములోని
ఒకానొక వైవిధ్య భరితమైన మాధుర్యాన్ని వీనులకు విందును చేకూర్చినది.
( చిత్రం: శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు
సంగీతము ;;;;; పెండ్యాల నాగేశ్వర రావు
రచన ;;;;;;; పింగళి నాగేంద్ర రావు
గానం: మంగళంపల్లి బాల మురళీకృష్ణ, యస్. జానకి )
________________________________




వసంత గాలికి వలపులు రేగ
వరించు బాలిక మయూరి కాగా
తనువు మనసు ఊగి తూగి
ఒక మైకం కలిగేనులే !!!
మహిమ నీదేనులే !
ప్రేమతీరు ఇంతేనులే //

~1) రవంత సోకిన చల్లని గాలికి
మరింత కోరిన వసంతుడనగా
తనువు , మనసు ఊగి తూగి
ఈ లోకం మారేనులె
మహిమ నీదేనులే !
ఆహా భలే హాయిలే !!!

2)విలాస మాధురి వెన్నెల కాగా
విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే '
ఒక స్వర్గం కనుపించెనే !
మహిమ నీదేనులే !
ప్రేమ తీరు ఇంతేనులే //

Sunday, July 26, 2009

ఇల్లాలు(సినిమా పాట)

ఇల్లాలు -(cinima)
(నటి;గీతాంజలి )
రచన ;ఆత్రేయ :మ్యూజిక్ : మహదేవన్
పల్లవి:
------
మల్లె పూవులు విరిసెరా -
మంచు తెరలు కరిగెరా
-నల్లనయ్యా మేలుకో -
చల్లనయ్యా మేలుకో -
//మల్లె పూవులు విరిసెరా - మంచు తెరలు కరిగెరా -//

1)పురిటి వెలుగున బుగ్గపై - - నీ పంటి నొక్కులు కంటిరా - -
చిరుత నవ్వుల పెదవిపై - -చిరుత నవ్వుల పెదవిపై - -
నా కంటి కాటుక నంటె రా! - -
//నల్లనయ్యా మేలుకో ! -చల్లనయ్య మేలుకో ! - -//

2)చిక్కు పడినా కురులు చూసి - - సిగ్గు ముంచుకు వచ్చెరా ! - -
రేయి గడపిన హాయినంతా - -రేయి గడపిన హాయినంతా - -
మనసు నెమరు వేసెరా ! -//నల్లనయ్యా మేలుకో !చల్లనయ్యా!! మేలుకో !//

3)నీవు నిండుగా నవ్వినపుడే - -నాకు నిజముగ తెల్లవారును - -
నా కాపురాన రేపు మాపులు - -కాపురాన రేపు మాపులు -
-కలవురా నీ చూపులోనే - -
//మల్లె పూవులు విరిసెరా !మంచు తెరలు తొలగెరా !
నల్లనయ్యా మేలుకో! చల్లనయ్యా మేలుకో !//
-
-


వినిపించని రాగాలే -
కనిపించని అందాలే -
అలలై మదినే తలచే
-కలలో ఎవరో పిలిచే -
//వినిపించని రాగాలే -//
1)తొలిచూపులు నాలోనే -వెలిగించె దీపాలే (౨)
చిగురించిన కోరికలే -చిలికించెను తాపాలే -
వలచె మనసే మనసు వినిపించని
2)వలపే వసంతములా -పులకించిపోయినదీ (౨)
చెలరేగిన తెమ్మెరలే -గిలిగింతలు రేపినవీ -
విరిసి విరిసే వయసు వినిపించని
3)వికసించెను నా వయసే -మురిపించు ఈ సొగసే -
విరితేనెల వెన్నెలలో -కొరతేదో కనిపించే -
ఎదలో ఎవరో మెరిసే వినిపించని
(చదువు కున్న అమ్మాయిలు -
మ్యూజిక్ -సాలూరు రాజేశ్వర రావు -)

Post Views

Wednesday, July 1, 2009

యుగళ గీతము


(బి.సరోజ ,రామా రావు )
రేపంటి రూపం కంటి
పూవింటి చూపుల వంటి
నీ కంటి చూపుల వెంట
నా పరుగంటి !
రేపంటి వెలుగే కంటి !
పూవింటి దొరనే కంటి
నా కంటి ,కళలూ కలలు
నీ సొమ్మంటీ!
నాతోడు నీవైయుంటే
నీ నీడ నేనేనంటి..
ఈ జంట కంటే వేరే
లేదు - లేదంటి!
నీ పైన - ఆశలు వుంచి
ఆపైన కోటలు పెంచి,
నీ కోసమ్ ,
రేపూ మాపూ -
వుంటిని నిన్నంటి // రేపంటి //
నే మల్లెపువ్వై విరిసి
నీ నల్లని జడలో వెలసి
నీ చల్లని నవ్వుల కలసి
వుంటే చాలంటి !
నీ కాలిమువ్వల రవళి
నా -భావి మోహన మురళి
- రాగసరళి
తరలిపోదాం రమ్మంటి//రేపంటి //
నీలోని మగసిరితోటి
నాలోని - సొగసుల పోటి
వేయించి ,
నేనే ఓడిపోనీ -పొమ్మంటి !
నేనోడి ,నీవే గెలిచి
నీ గెలుపు నాదని తలచి ,
రాగాలు రంజిలు రోజే
రాజీ రమ్మంటి! //రేపంటి //
::::::::::::::::::::::::::::::::::::::::::::
{చిత్రం : మంచి -చెడు}
గానం : ఘంటసాల, ,సుశీల ;
రచన ; : ఆత్రేయ
మ్యూజిక్ : విశ్వనాధన్ - రామమూర్తి

Tuesday, June 16, 2009

"కులగోత్రాలు"(సినిమా పాట)





సరే!ఈ క్రింద ఉదాహరించిన గీతమును చదవండి ;
ఆనక విని ఆనందించండి.
"కులగోత్రాలు" సినిమాలోనిది ఈ పాట .
నాగేశ్వర్ రావు,కృష్ణ కుమారి లు నటించారు.
సినిమాలో వారి పేర్లు "రవి,సరోజ"లు.
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ...."
వెండి తెరపైన సుందరమైన దృశ్యీకరణ.

*********************************************

పల్లవి ;;;;

చెలికాడు నిన్నే రమ్మని
పిలువాచేరరావేలా
ఇంకా సిగ్గు నీకేలా //

~1)(ఆమె );;;;;;;;;;
ప్రియురాలి ఏముందో ,
తెలుపమంటావా
నన్నే తెలుపమంటావా / //చె లికాడు //

~౨) (అతడు );;;;;
నీ నవ్వులో ఏపువ్వులో
పన్నీరు చిలికాయీ
నీ నవ్వులో ఏపువ్వులో
పన్నీరు చిలికాయీ
(ఆమె ) ;;;;;;
కిరణాలలోనేగా సరోజం
కిలకిల నవ్వేదీ
ఆహాహా ...అహా ఒహోహో ....
అహహా ఒహో ......అ //ఆచెలికాడు //

~3) (అతడు) ;;;;;;
నీ అందమే శ్రీగంధమై
నా డెంద మలరించె !!
నీ రూపె దీపమ్మై
ప్రియా! నా చూపుల వెలిగించే!
అహహా ... అహా ఒహోహో .....:
అహహా ఒహో.......అ ఆ ...//చెలికాడు //
4)నీతోడుగా నడయాడగా
ఇంకేమి కావాలీ? !
మధురానురాగాలే
ఫలించే తరుణం రావాలీ!
అహహా...అహా ఒహోహో....హహా
ఒహో...అ ఆ . . //చెలికాడు//

********************************************

Tuesday, April 21, 2009

పట్టుదల
















       
         అబ్బులు చాలా అమాయకుడు. అతని అమాయకత్వము తెలిసి, అందరూ మోసగిస్తూ ఉండే వాళ్ళు.
 ఆ ఊళ్ళో 'కరటకుడనే' వాడు ఉండేవాడు.
వాడిదగ్గర ఒక గుర్రము ఉన్నది. అది చాలా మొండిది కావడంతో, కరటకుడికి చాలా విసుగు పుట్టింది. అబ్బులు అమాయకత్వంగూర్చి విని,
ఆ మొండి గుర్రాన్ని అబ్బులుకు అంట కట్టాలనుకున్నాడు.
వెంటనే అబ్బులు దగ్గరికి వెళ్ళాడు కరటకుడు. 

         "అబ్బులూ! నా గుర్రం చాలా మంచిది. ఈ గుర్రం మంచి రాశి గలది.
 దీన్ని కొన్న వాడు బాగా ధన వంతుడు ఔతాడు." అని చెప్పాడు కరటకుడు. 

         అతని మాటలను నమ్మి, అబ్బులు ఆ అశ్వాన్ని కొన్నాడు.
 పాపం! అబ్బులు దాన్ని ఎక్క బోతే అది ముందు కాళ్ళతో తన్నింది.
ఈ చోద్యాన్ని చూస్తున్న 'కరోడుడు ' అనే వాడు
"అబ్బులూ! నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది.
 అది చాలా మొండి గుర్రం. నువ్వు చాలా తంటాలు పడాల్సి వస్తుంది కదా!"
అని, అంతటితో ఊరుకోక,
"ఇదిగో! నా దగ్గర ఉన్న గుర్రాన్ని చూడు! చాలా కొత్తది.
 ఇది నిన్ను ముందరి కాళ్ళతో తన్నదు. కావాలంటే పరీక్షించు" అన్నాడు.
 అంటూనే దానిపైన అబ్బులును కూర్చో బెట్టాడు.
అది ఏమీ చేయక పోవడంతో ఆతని మాటలను నమ్మి డబ్బులు ఇచ్చి కొన్నాడు.

ఇంతకీ కరోడుడు అమ్మింది గుర్రాన్ని కాదు..... 'గాడిద 'ను.

         అలా గుర్రం అనుకుని గాడిదను తన ఇంటికి తెచ్చు కున్నాడు అబ్బులు.
తీరా ఎక్కబోతే అది వెనక కాళ్ళతో తన్నింది. అది గాడిద కదా మరి!
ఈ తతంగాన్ని అంతా కని పెట్టిన వేరొక మోసగాడు
"నా దగ్గర ఉన్న గుర్రాన్ని చూడు! ఇది ముందు కాళ్ళతో తన్నదు, వెనక కాళ్ళతో తన్నదు"
అంటూ నమ్మించి, రొక్కమును(డబ్బు)పుచ్చుకుని ఉడాయించాడు.
ఓ కొయ్య గుర్రాన్ని అంట గట్టాడు అబ్బులుకు. 
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


         అబ్బులు మోస పోయిన వైనాన్ని చూసి అందరూ గేలి చేసారు,
 చిలవలు పలవలుగా చెప్పుకున్నారు.
అది భరించ లేక అబ్బులు కొయ్య గుర్రాన్ని తీసుకుని అడవిలోనికి వెళ్ళాడు.
అక్కడ ఓ ఊడల మర్రి చెట్టు కింద కూర్చుని ఏడ్వ సగాడు. 
ఆ చెట్టు మీద ఉంటున్న దేవత,
 అతని పైన జాలి పడి, కొయ్య గుర్రానికి ప్రాణము పోసింది.
 ప్రాణము వచ్చిన ఆ గుర్రము అబ్బులుకు చదువు నేర్పింది.
కాల క్రమేణా అరణ్యములోని జంతువులు,పక్షులు అతని నేస్తాలు అయ్యాయి.
 చెట్లను ఎక్కడాన్నీ, స్వారీ చేయడమూ వగైరా విద్యలను నేర్ప సాగాయి.
 కానీ.... అబ్బులుకు ఏ విద్యలూ సరిగా అబ్బలేదు. 

         "పంచ కళ్యాణి" అని అబ్బులు తన గుర్రానికి ముద్దుగా పేరు పెట్టుకున్నాడు.
 పంచ కళ్యాణి" తన యజమాని స్వారీ ఎందుకు నేర్చుకోలేక పోతున్నాడో "అని ఆలోచించింది.
 అతనిలో దాగి ఉన్న పిరికి తనమే కారణమనీ పసి కట్టింది.
ఒక రోజు అబ్బులుకు సవ్వారీ నేర్పుతూ,
 అతణ్ణి కావాలనీవాగులో పడెసింది.
 నీళ్ళలో పడిన అబ్బులు
"కళ్యాణీ! కళ్యాణీ! కాపాడు!" అంటూ గావు కేకలు పెట్టాడు.
 కానీ లాభము లేక పోయింది.
నీటిలో గిర గిరా, గింగిర్లు తిరుగుతూ భయంతో బెంబేలెత్తుతూ 
ఎలాగైతేనేం, అలాగే ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. 

       
  "ఈత కొట్టడము తెలీని తాను
తీరానికి అలాగే ఈదుకుంటూ చేరాడము ఆశ్చర్యంగా ఉన్నదే!!!"
 అనుకున్నాడు అబ్బులు. 

"చూశావా అబ్బులూ? జల క్రీడలు కూడా తెలీని నువ్వు,
 చిటికెలో ఈత నేర్చుకుని, ఒడ్డుకు చేరావు. 
పట్టుదల, ఏకాగ్రత ఉంటే ఏ విద్య ఐనా నేర్చుకోవచ్చును"
 అనిన పంచ కళ్యాణి మాటలు, అబ్బులు పైన బాగా పని చేసాయి,
 ఆత్మ స్థైర్యాన్ని నింపినవి. 

         అది మొదలు అన్ని రకముల విద్యలనూ
 తిరిగి వెను చూసుకోకుండా నేర్చుకున్నాడు అబ్బులు. 
సంఘములో తిరుగు లేని కీర్తిని ఆర్జించాడు.



'''''''''

''''''''''''''''''''