Friday, August 7, 2009

శార్దూల ఛందస్సు,చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి

శా."నా మార్గమ్మును కాదు, శిష్యుడయినన్‌ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; వీని దెదియో? ఈ వూర్గ మట్లౌటచే,
సామాన్యుండనరాదు వీని కవితాసమ్రాడ్వ్తమా హేతువై,
ఈ వుచ్చిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్‌ ."

సత్యనారాయణగారికి గుడివాడ ఎ.ఎన్‌.ఆర్‌. కాలేజీలో సన్మానం జరిగింది. ఆ సందర్భములో, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు తొమ్మిది ఆశీర్వచన పద్యాలు చెప్పారు. వానిలోని ఎనిమిదవది పైన చెప్పిన శార్దూల ఛందస్సులోని పద్యము.
“నా శిష్యుడే అయినా, ఇతనిది నా పద్ధతి కాదు. నా తాత ముత్తాతల పద్ధతీ కాదు. (= మన పూర్వ కవులు) ఇతడిని సామాన్యుడు అని అనుకోకూడదు. కవితాసంరాడ్వ్తమాహేతువై ఈ నా శిష్యుడిని వరించింది. నాకెంతో సంతోషంగా ఉన్నది."
కోట సుందరరామశర్మగారు తమ కాలం నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,ఇలాగ సెలవిచ్చారు"చెళ్ళపిళ్ళవారి శిష్యుడిని అని చెప్పుకోవడం మా రోజులలో తెలుగు కవులకి, పండితులకీ ఒక certificate , యోగ్యతాపత్రం లాంటివే!. ఒక నెలో, రెండునెలలో చెళ్ళపిళ్ళ వారి దగ్గిర చేరి, వారి శిష్యుడినే అని వందలమంది గర్వంగా,ఆనందంతో చెప్పుకునేవారు.".
(చూడుము:::30జూలై,2008-
"బాస, భాష" జొన్నలగడ్డ తో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి సంభాషణ

No comments:

Post a Comment